విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన సిపిఎం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి.. ఇంతియాజ్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు.. పోలా రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అతి చిన్న వయసులోనే చురుగ్గా ఉంటూ, ఎన్నో పోరాటాలు సల్ఫీ ,ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందిన నామాల నాగార్జునను పట్టణ సిపిఎం కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు. అనంతరం నామాల నాగార్జున మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష స్థాయి నుండి జిల్లా అధ్యక్ష సాయి వరకు నాలుగు సంవత్సరాలు పాటు పనిచేస్తూ క్రమశిక్షణతో తన పని విధానాన్ని పార్టీ గుర్తించి, నన్ను పట్టణ కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. పట్టణ కార్యదర్శిగా పట్టణ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, చేనేత, పేద బడుగు బలహీన వర్గాల కోసం సమస్యల పరిష్కారానికి పోరాడుతానని తెలిపారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని ప్రజా వ్యతిరేక పనులపై ప్రభుత్వంపై పోరాటాలు సల్పుతానని తెలిపారు. ఈ సందర్భంగా జే. పెద్దన్నకు, ఎస్హెచ్ భాష, ఆదినారాయణ, వెంకటస్వామి, హరి, సన్నప్పయ్య, సురేష్, తదితర నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.