విశాలాంధ్ర- ఉరవకొండ : తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ాటెలీ- మానస్్ణ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ ాటెలీ-మానస్్ణ పేరుతో సైకాలజిస్టుల సేవలు అందించునున్నారని విద్యార్థులు మానసికి ఒత్తిడిని జయించేందుకు ఈ సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆస్రాఫ్ అలీ, త్రిబుల్ ఈ శాఖ అధిపతి సురేష్ బాబు తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఒత్తిడికి గురయ్యే విద్యార్థులుకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ వారు ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14416కు లేదా 1800-891-4416 కు ఫోన్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఉచితంగా మానసిక వైద్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు 24 గంటలు వారం రోజులు పాటు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఇలాంటి సేవలను విద్యార్థులకు అవకాశం కల్పించిన కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ శ్రీమతి నాగరాణి, జాయింట్ డైరెక్టర్ పద్మారావు, కార్యదర్శి రమణ బాబుకు ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక బృందం, మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు