విశాలాంధ్ర – కర్నూలు సిటీ : దైనందిన జీవితంలో యోగ సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని ప్రముఖ యోగా గురువు ఉమా దేవి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ డాక్టర్ కె శాంత ఆధ్వర్యంలో విద్యార్థులచేత యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు వేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోజు మనం చేయవలసిన ఆసనాలు వాటి ప్రాముఖ్యతను, ప్రయోజనాలను వివరించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించేందుకు యోగా ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారులు డి వెంకటేశ్వర్లు, ఎ మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ కమిటీ స్వాతి కళ్యాణి, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.