విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని ఎంటిఎస్ ఉపాద్యాయులు విద్యార్ధుల బోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల విద్యాశాఖాధికారులు జి. సూరిదేముడు, మువ్వల వెంకటరమణలు పిలుపు నిచ్చారు.శనివారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో మండలానికి కేటాయించిన 24మంది ఎంటిఎస్ ఉపాధ్యాయసిబ్బందికి(1998, 2008 డి.ఎస్సీల అభ్యర్ధులు) ఆర్డర్లు ఇస్తూ వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. విధ్యార్ధుల రోల్ పెంచాలని, తరల్ ప్రకారం బోధన చేయాలని, విధ్యా ప్రమాణాలు పెంచాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, 24మంది ఎంటిఎస్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
మండలానికి కేటాయించిన 24మంది ఉపాధ్యాయులకు కేటాయించిన స్కూల్ల వివరాలను వారు తెలిపారు. ఆల్లు వెంకట రమణకు గుచ్చిమి, గొట్టాపు ప్రసాద రావుకు గుచ్చిమి, సిరికి మహేశ్వరరావుకు ఏ.వెంకటపురం, పెంట మోహనరావుకు వెన్నెలబుచ్చెంపేట, మూడడ్లసత్యనారాయణకు ఎన్. వెంకట పురం, దొగ్గ మోహన్ కు చినఅంకలం, పూడు శంకరరావుకు పాపమ్మవలస, బొత్స శ్రీరాములుకు సుమిత్రపురం, శ్రీనివాసరావుకు రంగమ్మపేట, రెడ్డి భాస్కరరావుకు లక్ష్మిపురం కేటాయించారు. వంగపండు సింహాచలంకు జోగమ్మపేట, టి ఎస్ ప్రకాశరావుకు బుడ్డి పేట, బలగ అప్పలనాయుడుకు లక్ష్మి పురం, పతివాడ శ్రీనివాసరావుకు పెదభోగిలి, ఎన్ ధనంజయనాయుడుకు బగ్గందొరవలస, అల్లు ప్రసాదరావుకు ఎగోటివలస, కె.రామకృష్ణకు అనంత రాయుడుపేట కేటాయించారు. కొల్లి స్వామినాయుడుకు పూనుబుచ్చెంపేట, జి డి వి ప్రసాద్ కు కొత్తవలస, జి. రామకృష్ణకు బి.జగన్నాథపురం, ఎం సంధ్యకు అంటిపేట, ఎస్ త్రివేణికి చిన్నా రాయుడుపేట, జి తిరుపతికి బల్ల కృష్ణాపురం, ఏ. శ్రీనివాసరావుకు పనుకుపేటకేటాయించారు.వారంతాశనివారం విధుల్లో చేరినట్లు తెలిపారు.