విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : భారతీయ జనతా పార్టీ పుట్లూరు మండల అధ్యక్షులు కుందూ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాలు పరిపాలన ముగించుకున్న సందర్భంగా పుట్లూరు మండల పరిధిలోని కడవకల్లు గ్రామంలో నరేంద్ర మోడీ సేవ, సుపరిపాలన పేదల క్షేమం గురించి కరపత్రాలు పంచడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి అనంతపురం పార్లమెంటు కన్వీనర్ శ్రీ కణంపల్లి చిరంజీవి రెడ్డి, బిజెపి జిల్లా ఇన్చార్జ్ శ్రీనాథ్ రెడ్డి,యువమోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కణం పది చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ… మోడీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో ప్రవేశపెట్టారని వాటిలో ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదలకు ఇల్లు , కరోనా సమయంలో వాక్సిన్లు మరియు ఉచిత బియ్యం, ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం, గర్భిణీ స్త్రీలకు మాతృ వందన యోజన, మరియు పౌష్టిక ఆహారం, గ్రామాలలో స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, పీఎం కిసాన్ సమ్మన్ నిధి క్రింద ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయలు పెట్టుబడి సాయం, చిరు వ్యాపారస్తుల కోసం ముద్ర లోన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్లు, రహదారులు, జలజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, ప్రధానమంత్రి జనదన్ యోజన కింద ప్రతి వ్యక్తికి అకౌంట్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల సంక్షేమం ఆలోచించి ప్రగతి పథకం వైపు నడిపిస్తున్నారు. నరేంద్ర మోడీ ని మళ్లీ 2024లో ప్రధానమంత్రి చేసుకుంటే దేశ భద్రత మరియు భారతదేశ సంక్షేమం, రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది. కావున మనందరం మళ్లీ ఒకసారి ఆయన నాయకత్వాన్ని బలపరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మిట్ట రాజా, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రాగేని రామంజి యాదవ్, మండల ఇంచార్జ్ వెంకటయ్య, ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, నార్పల మండల అధ్యక్షుడు కాశి విశ్వనాథ్, విమోచయ మండల అధ్యక్షుడు ఏ నాగార్జున, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దామోదర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.