Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

క్వాలిటీ కంట్రోలు విభాగంలేని పోలవరం

వి. శంకరయ్య

పోలవరం ప్రాజెక్టుకు ఏ సుముహూర్తాన లేక దుర్మూహూర్తాన పునాదిరాయి పడిరదో ఏమో గాని భారత దేశంలోనే ఏ సాగునీటి ప్రాజెక్టుకు లేనన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకటి కాదు. అనేకం. లెక్కలేనన్ని. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిం చినా కేంద్రం నుండి సకాలంలో చాలినన్ని నిధులు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే స్థితిలో రాష్ట్ర ప్రభు త్వమూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరిం చనందున ప్రాజెక్టు నిర్ణీత కాలంలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు. ఫలితంగా ఏ ఏటికాయేడు నిర్మాణ వ్యయం ఆంజనేయుని వాలంలాగా పెరిగిపోతోంది.
ఈ స్థితిలో ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. తుదకు 194.60 టియంసిల నీరు నిల్వచేయగల బహుళార్థ సాధక ప్రాజెక్టును ఒక బ్యారేజీగా చేసి 92 టియంసిలు నిల్వకు పరిమితం చేస్తారనే వార్తలు హడలు పుట్టిస్తున్నాయి. తాజాగా ఇప్పటివరకు నిర్మితమైన ప్రాజెక్టు వివిధ విభాగాల భద్రత ప్రమాణాలపైన నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యాంలో సాధారణ స్థితికన్నా ఎక్కవగా లీకేజీ వుందని గత సంవత్సరం లాగా ఈ ఏడు భారీ వరద వస్తే కాఫర్‌ డ్యాం ఎంత వరకు తట్టుకొని నిలబడుతుందనే భయాలు వెన్నాడుతున్నాయి. దీనికి తోడు స్పిల్‌వే పక్కన దాని పటిష్టత కోసం నిర్మించిన గైడ్‌ బండ్‌ ఇటీవల కూలిపోయింది. అయిదు మీటర్ల లోతు నుండి 25 మీటర్ల ఎత్తు వరకు నిర్మించిన రీటైనింగ్‌ వాల్‌ ఆధారం చేసుకొని గైడ్‌ బండ్‌ నిర్మించారు. నిర్మించి రెండు నెలలు పూర్తి కాక ముందే గైడ్‌ బండ్‌ కూలిపోయింది. అంటే గైడ్‌బండ్‌కు సపోర్ట్‌గా నిర్మించిన రీటైనింగ్‌ వాల్‌ కుంగిపోవడంతో గైడ్‌బండ్‌ కూలి పోయింది. కాగా 2020 సంవత్సరం వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ 2022 లోగాని గుర్తించలేకపోయారు. వేలకోట్ల వ్యయంతో కొన్ని లక్షల ప్రజల జీవితాలతో ముడిపడి నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులో ఒకటికి రెండు విభాగాల్లో నిర్మాణ దశలోనే లొసుగులు ఏర్పడితే ఇక మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏ పరిణామాలకు దారి తీస్తుందోననే ఆందోళన కలగడం అసహజమేమీ కాదు. ఇటీవల దిల్లీ నుండి వచ్చి ఈ నిర్మాణ లోపాలను పరిశీలించి వెళ్లిన నిపుణుల బృందం ఇంకా నివేదిక ఇవ్వలేదంటున్నారు. కాగా అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణంపై కూడా విమర్శలున్నాయి.
ఇవన్నీ అటుంచగా కొన్ని వందల కోట్లు వ్యయంచేస్తూ శతాబ్దాలపాటు పదిలంగా వుండ వలసిన భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే నాణ్యతా ప్రమాణాలు, పర్యవేక్షణకు పటిష్టమైన క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఎందుకు లేదు? క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు వుంటే ఈ లొసుగులకు ముందుగా వారు బోను ఎక్కవలసి వుంది. విస్తుగొల్పే అంశమేమంటే గైడ్‌బండ్‌ కూలిపోయిన తర్వాత నిపుణుల బృందం వచ్చిన సమయంలోగాని, అంత క్రితం, తర్వాతగాని పరిశీలనలేక చర్చల సందర్భంగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల ప్రస్తావన ఏ మాత్రం రాలేదు. వాస్తవంలో నిపుణుల బృందం వచ్చినపుడు ముందుగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారులను విచారణ జరపవలసి వుంది. ఏ సందర్భంలో కూడా వారి ప్రస్తావన లేదంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగం లేనట్లే భావించ వలసి వస్తోంది. తెలుగుదేశం హయాంలో చేపట్టిన రహదారులు, కాలువల, కుంటల మరమ్మతులకు ఇప్పుడు బిల్లులు ఇచ్చే సమయంలో విజిలెన్స్‌ అధికారులు కత్తితో కోతకోసి బిల్లులను చెల్లించుతున్న రాష్ట్రప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులను నియమించలేదంటే ఏలా నమ్మ గలం?
ఈ లొసుగుల వ్యవహారంలో కేంద్ర జలశక్తిశాఖతో పాటు అది ఏర్పాటుచేసిన రెండు సంస్థలు కూడా బాధ్యత వహించవలసివుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం రెండు సంస్థలను నియమించింది. డిజైన్‌లు ఆమోదించడం సాంకేతిక అంశాలపై డ్యాం డిజైన్‌ రివ్యూ పానల్‌ కమిటీ ఒక దాన్ని నియమించింది. వీరి ఆమోదం లేకుండా సాంకేతిక అంశాల్లో పూచిన పుల్లంత పనిజరిగేందుకు వీలులేదు. ఈ పానల్‌ కమిటీ ఆమోదం లేకుండా చిన్న నిర్మాణం జరిగే అవకాశంలేదు. 2019కి మునుపు ముంపుప్రాంతాల్లో నష్టపరిహారం పునరావాసం పూర్తి కానందుననే వరద ప్రవాహం దృష్టిలో పెట్టుకొని ఎగువ కాఫర్‌ డ్యాంలో రెండు గ్యాప్‌లు పూడ్చవద్దని ఆదేశించారు. 2019లో అధికారంలోనికి వచ్చిన వైసిపి ప్రభుత్వం 2020లో వరద వచ్చేవరకు గ్యాప్‌లు పూడ్చనందున భారీ వరదకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బ తినింది. అదేవిధంగా ప్రాజెక్టు అథారిటీ ఒక దాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. బిల్లులు చెల్లింపు ప్రాజెక్టు పురోగతి నివేదికలను కేంద్రానికి పంపడం తదితర కర్తవ్యాలను అథారిటీ నిర్వర్తిస్తుంది.
ఇంత పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు చేసిన కేంద్ర జలవనరులశాఖ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నాణ్యతతో కూడిన భద్రత ప్రమాణాలు పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్‌ అధికార విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నందున ఈ బాధ్యతను దానికే వదలి పెట్టిందా? చాల మందికీ గుర్తు వుండక పోవచ్చు. టిడిపి హయాంలో సాంకేతిక నిపుణుడు భార్గవ్‌ తరచూ పరిశీలనకు వచ్చేవారు. ఒక దఫా పరిశీలన సందర్భంగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు వున్నారా? ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారా అని గట్టిగా నిలదీసిన సందర్భముంది. తర్వాత ఎప్పుడూ దిల్లీ నుండి వచ్చే నిపుణులు గాని, ప్రాజెక్టు అథారిటీ డ్యాం డిజైన్‌ రివ్యూ పానల్‌ కమిటీ ఏ సందర్భంలో కూడా క్వాలిటీ కంట్రోల్‌ విభాగం గురించి వాకబు చేసినట్లులేదు. ఇప్పడు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో ఈ విభాగం అధికారులు వుంటే ముందుగా వీళ్లు బోను ఎక్కవలసి వుంది.
సెల్‌: 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img