విశాలాంధ్ర – కర్నూలు సిటీ: వైద్యులు దైవ సమానులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత పేర్కొన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని గాయత్రీ స్టేట్ సద్గురు దత్త పాలి క్లినిక్ లో మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహిళలు సమాజ సేవకులు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మను శాలువా కప్పి పూల బొకేతో సన్మానం చేశారు. తల్లితండ్రులు పిల్లలకు జన్మనిస్తే వైద్యులు వారికి పునర్జన్మని ఇస్తారని ఆమె తెలిపారు.