హైదరాబాద్: స్మార్ట్, కనెక్టెడ్, సురక్షితమైన ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్లకు సంబంధించి అగ్రగామి సంస్థలలో ఒకటిగా వెలుగొందుతున్న మైక్రోచిప్ టెక్నాలజీ ఇన్కార్పొరేటెడ్ తాజాగా కోకాపేట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వన్ గోల్డెన్ మైల్ ఆఫీస్ టవర్లో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోచిప్ కొత్త డెవలప్మెంట్ సెంటర్ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, న్యూఢల్లీిలోని సేల్స్ ఆఫీసులతో పాటు బెంగుళూరు, చెన్నైలోని మరో రెండు డెవలప్మెంట్ సెంటర్లతో చేరబోతుంది. ప్రతిభావంతులైన వర్కుఫోర్స్ను పెంపొందించటం, అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతీయ సెమీకండక్టర్ హబ్లో తన కార్యకలాపాలు పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ప్రకటించిన బహుళ-సంవత్సరాల పెట్టుబడి కార్యక్రమంలో ఒక కీలకమైన అంశమని మైక్రోచిప్ ప్రెసిడెంట్, సీఈఓ గణేష్ మూర్తి అన్నారు.