విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- మండల కేంద్రమైన నాగులుప్పలపాడు ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలకు అదే కాలనీకి చెందిన మాచవరపు కిరణ్ కంప్యూటర్ ను మంగళవారం అందజేశారు. పాఠశాలలోని విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు కంప్యూటర్ అందజేసినట్లు దాత కిరణ్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రధానోపాధ్యాయురాలు మంజుల అన్నారు కార్యక్రమంలో గుంపుల సుబ్బారావు కోటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.