న్యూదిల్లీ: ఫోన్పే తాజాగా తన పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) పరికరాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇకపై వ్యాపారులు ఈ పరికరాన్ని ఉపయోగించి డెబిట్ కార్డ్లు, క్రెడిట్ కార్డ్లు, యూపీఐ ద్వారా చెల్లింపులను యాక్సెప్ట్ చేసేందుకు వీలవుతుంది. వారికి సులభమైన, అవాంతరాలు లేని చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది. ఈ పరికరంలో ఫోన్పే పీఓఎస్ యాప్ ముందుగానే లోడ్ అయి ఉంటుంది. అలాగే ట్యాప్/స్వయిప్/డిప్ పద్ధతులతో పాటు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే డైనమిక్ క్యూఆర్ కోడ్లతో చేసే లావాదేవీలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ పీఓఎస్ పరికరం, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై నిర్మితమైంది. వ్యాపారాలు నిర్వహించే వారికి విప్లవాత్మక చెక్అవుట్ అనుభవాన్ని అందిస్తుంది. కస్టమర్లు కౌంటర్ వద్ద ఉన్నా, టేబుల్ వద్ద ఉన్నా, డెలివరీ లొకేషన్లో ఉన్నా లేదా సెల్యులార్ కవరేజీ ఉన్న ఎక్కడైనా సరే, చెల్లింపు ప్రక్రియను ఈ పరికరం సులభతరం చేస్తుంది.