ముంబయి: ప్రముఖ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ పిక్యూ (పీఐక్యూవైయూ), ప్రముఖ ఫైనాన్స్ ప్లాట్ఫారమ్ బైక్ బజార్తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిగాస్ వెల్లడిరచింది. చివరి-మైలు డెలివరీ కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడం, స్థిరమైన రవాణా పరిష్కారాల స్వీకరణను ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, బిగాస్ నుండి ప్రారంభ 150 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్సింగ్ను బైక్ బజార్ సులభతరం చేస్తుంది. తద్వారా పిక్యూ ఈ వాహనాలను సజావుగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యూహాత్మక భాఫాస్వామ్యం, హైదరాబాద్లో పిక్యూ 3పీఎల్, లాస్ట్ మైల్ డెలివరీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం మరియు ఈ సంవత్సరం ఇతర నగరాల్లో విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.