ముంబయి: ప్రపంచ స్వర్ణ మండలి (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) గురువారం ‘గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ అండ్ ఫైనాన్షియలైజేషన్’ పేరుతో తమ ఇండియా గోల్డ్ మార్కెట్ సీరీస్ చివరి అంకాన్ని ప్రకటించింది. నివేదిక ప్రకారం, ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం బార్, నాణెం మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. బంగారం కోసం అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి గిరాకీని స్వాధీనం చేసుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియా ప్రాంతీయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పిఆర్ సోమసుందరం మాట్లాడుతూ, శతాబ్దాల పాటుగా భారతీయుల గృహాలలో బంగారం ఎదుగుతున్న భారతదేశంలో ఒక గణనీయమైన పాత్రను పోషిస్తున్నదని అన్నారు. సమగ్ర బంగారం సముపార్జన ఫ్రేమ్వర్క్లో భాగంగా కొనుగోలులో పారదర్శకతను ప్రోత్సహించడానికి ద్రవ్యమార్పిడి ట్రేడిరగ్ పద్ధతి, పన్ను ప్రోత్సాహకాలు, సంఘటిత రీసైక్లింగ్ మార్కెట్కు ప్రాథాన్యతనివ్వాల్సిన అవసరం వుందన్నారు.