విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని నిడగల్లు పశువైద్య కేంద్రంలో శుక్రవారం విజయనగరం డి ఎల్ డి ఎ ఆద్వర్యంలో లేగదూడలు ప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనూహ్య స్పందన లభించిందని పశువైద్యశాఖజిల్లా అధికారులు డాక్టర్ ఎన్ దామోదరరావు, డాక్టరు బి.శ్రీనివాసరావు, డాక్టరు రెడ్డి నీలయ్యలు తెలిపారు.43లేగదూడలు ప్రదర్శనలో పాల్గొనగా వాటిలో ఎన్ కామయ్య, బి లక్షుమునాయుడు, వి రామ కృష్ణల లేగదూడలు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి బహుమతులు పొందారు. పశుసంపదను కాపాడాలని, పశువుల పట్ల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రైతులు పశు సంపదను కాపాడుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో డాక్టరు కె. ప్రసాదరావు, డాక్టరు చింతాడ దీనకుమార్, డాక్టర్ బి. చక్రదర్, డాక్టరు సిరిపురపు రామారావు తోపాటు సిబ్బంది సంజీవరావు, చంద్ర శేఖర్, పశువైద్య సహాయకులు,సచివాలయం సిబ్బంది, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.