విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.27.12.2023ది. అనకాపల్లి జిల్లాలో ప్రముఖ వైద్యుడు గానే కాకుండా సేవలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన డాక్టర్ బండారు సత్యనారాయణ మూర్తి చోడవరం లో దశాబ్దానికి మోపైగా వైద్య సేవలు అందిస్తూ చిరకాల పరిచితులుగా “మన డాక్టర్” గా ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత అని వాసవి క్లబ్ అనకాపల్లి జిల్లా వైస్ గవర్నర్ శ్రీనాధు మధు(ఆర్టీవో మధు) అన్నారు. డాక్టర్ బండారు స్వగృహంలో బుదవారం జరిపిన విలేఖరుల సమావేశంలో మధు మాట్లాడుతూ జిల్లా వైద్య సంఘానికి అధ్యక్షుడైన బండారు సత్యనారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేసి తన సేవలను మరింత విస్తరించారని తెలిపారు. ఆపన్నులకు అభయ హస్తం అందించే బండారు కు చోడవరం శాసన సభ్యత్వ0 తో నియోజక వర్గానికి సామాజిక సేవలు అందించాల్సిందిగా కోరారు. ఇప్పటికే అధికార పార్టీ పరిశీలనలో ఎమ్మెల్యే రేసులో ఉన్నట్లు ఆశావహ0 వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బండారు తో బాటు ప్రముఖ వ్యాపారవేత్త అడపా బ్రదర్స్, ముత్యాలు నాయుడు తదితరులు పాల్గొన్నారు.