నంద్యాల: కరూర్ వైశ్యా బ్యాంక్ ఈరోజు మూడు నూతన శాఖలను ప్రారంభించింది. వీటిలో తమిళనాడులో రెండు ఆంధ్రప్రదేశ్లో ఒకటి వున్నాయి. దీంతో బ్యాంక్ మొత్తం బ్రాంచ్ నెట్వర్క్ 834కి పెరిగింది. ఆత్మకూర్, నంద్యాల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ (832వ శాఖ). దీనిని ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్, పి. శ్రీనివాసరావు, ప్రారంభించారు. ఉసిలంపట్టి, మధురై జిల్లా, తమిళనాడు (833వ శాఖ). దీనిని ఉసిలంపట్టి మున్సిపల్ కమీషనర్, జె.గాంధీ ప్రారంభించారు. మాథూర్, చెన్నై, తమిళనాడు (834వ శాఖ). దీనిని ఎవర్విన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, చెన్నై సీనియర్ ప్రిన్సిపాల్, డాక్టర్ బి. పురుషోత్తమన్ ప్రారంభించారు. వృద్ధి, లాభదాయకత ఆస్తి నాణ్యత అనే మూడు స్తంభాలపై బ్యాంక్ తన ఆర్థిక వ్యవస్థను నిర్మించింది. బ్యాంకు మొత్తం వ్యాపారం 31.12.2023 నాటికి రూ. 1,58,357కోట్లు కాగా, వీటిలో డిపాజిట్లు రూ. 85,665 కోట్లు, అడ్వాన్సులు రూ.72,692 కోట్లు. బ్యాంక్ నికర లాభం క్యూ3 2023-24లో రూ. 412 కోట్లు. 01.04.2023 నుండి డిసెంబర్ 2023 వరకు 9 నెలల వ్యవధిలో నికర లాభం రూ.1149 కోట్లు కాగా , పేర్కొన్న త్రైమాసికంలో నికర ఎన్ పీ ఏ-0.42 శాతం, ఎన్ఐఎం-4.3 శాతం పీ సీ ఆర్ 94.81 శాతం ఇతర కీలక ఆర్థిక నిష్పత్తులుగా ఉన్నాయని కేవీబీ ప్రతినిధి చెప్పారు.