విశాలాంధ్ర/వరంగల్: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన గదర్ 2ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా తెలుగులో ప్రసారం చేయనుందని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమోషనల్ఎంటర్టైనర్ గదర్ 2, ఈ నెల 18వ తేది సాయంత్రం 5:30 గంటలకు, జీ తెలుగులో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. అనిల్ శర్మ దర్శకత్వంలో 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్, ఏక్ ప్రేమ్ కథ’కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కిందన్నారు. బాలీవుడ్ స్టార్యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించిన ఈ చిత్రం 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో తారా సింగ్ (సన్నీ డియోల్)ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిందని వివారించారు. జైలులో ఉన్న తన కుమారుడు చరణ్జీత్సింగ్ (ఉత్కర్ష్ శర్మ)ను రక్షించడానికి పాకిస్థాన్ నుంచి తిరిగివచ్చిన తారా సింగ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథన్నారు.