ముంబయి : భారతదేశంలో అందరూ అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న రైడిరగ్ ఎక్స్పీరియన్స్- బీఎండబ్ల్యు మోటోరాడ్ సఫారిని బీఎండబ్ల్యు మోటోరాడ్ ప్రారంభించింది. బీఎండబ్ల్యు మోటోరాడ్ మోటార్సైకిల్ యజమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీఎండబ్ల్యు మోటోరాడ్ సఫారి ప్రపంచవ్యాప్తంగా అల్టిమేట్ రైడిరగ్ ఎక్స్పీరియన్స్లను అందిస్తుందని బీఎండబ్ల్యు గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాప్ా తెలిపారు. బీఎండబ్ల్యు మోటోరాడ్ ప్రతి రైడర్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనుభవాల విస్తృత ప్రపంచాన్ని అన్లాక్ చేస్తుంది. షేరింగ్ చేసినప్పుడు రైడిరగ్ ఆనందం పెరుగుతుందన్నారు. బీఎండబ్ల్యు మోటోరాడ్ ఇండియా 2024లో 72 బీఎండబ్ల్యు మోటర్రాడ్ సఫారీలు, వీకెండ్ ఎస్కేప్లతో మోటార్సైకిల్ ఔత్సాహికులకు రైడిరగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రత్యేకమైన సఫారీలు భారతదేశం వ్యాప్తంగా విస్తరించి ఉన్న బీఎండబ్ల్యు విస్తృతమైన డీలర్ నెట్వర్క్ ద్వారా నిర్వహిస్తుండగా, ఇది బీఎండబ్ల్యు మోటోరాడ్ మోటార్సైకిళ్ల యజమానులకు సాహస యాత్రలలో అసమానమైన అవకాశాలను అందిస్తుంది. ఈ టూరింగ్ 5 నుంచి 7-రోజుల ప్రయాణాన్ని ఏకబిగిన ప్రారంభించి ముగిస్తుంది.