మాస్కో: ఇరాన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి రష్యా రాకెట్ గురువారం విజయవంతంగా ప్రవేశపెట్టింది. మాస్కో, టెహ్రా మధ్య సాన్నిహిత్యం, సహకారాన్ని మరింత పెంచుకునేలా తాజా ప్రయోగం జరిగింది. సోయుజ్ రాకెట్ ద్వారా ఇరాన్ ఉపగ్రహంతో పాటు 18 రష్యన్ ఉపగ్రహాలను నిర్ణేత కక్ష్యకు చేర్చిందని రష్యా అంతరిక్ష కేంద్రం ‘రాస్కాస్మోస్ కార్పొరేషన్’ ప్రకటించింది. వొటోచ్ని ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగిందని తెలిపింది. కాగా, 110కిలోల బరువుగల ఉపగ్రహాన్ని పర్యావరణం, వ్యవసాయంతో పాటు ఇతరత్ర అవసరాల కోసం ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఉపగ్రహంలో మూడు కెమెరాలు ఉన్నాయని పేర్కొంది. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హయాంలో ప్రయోగించిన 12తో కలిపి 23 అంతరిక్ష ప్రయోగాలను ఇరాన్ స్పేస్ ప్రోగ్రామ్ చేపట్టిందని మంత్రి ఈసా జరేపూర్ వెల్లడిరచారు. 2022లో ఇరాన్కు చెందిన ఖయ్యమ్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి రష్యా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.