విశాలాంధ్ర/ఖమ్మం: ఎథ్నిక్ అపెరల్ రిటైలర్ సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ (ఎస్ఎస్కేఎల్) తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే దిశగా, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఫార్మాట్లో ఖమ్మంలోని బైపాస్ రోడ్లో తమ 59వ స్టోర్ను ప్రారంభించింది. దీనితో పాటుగా కస్బా బజార్లో ఉన్న కళామందిర్ స్టోర్ను కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఫార్మాట్లోకి మార్చింది. ఈ స్టోర్ను త్రిదండి అహోబిల రామానుజున జీయర్ స్వామి ప్రారంభించారు. తెలంగాణలో సంస్థకు ఇది 26వ స్టోర్. ఈ స్టోర్ బనారసి, పటోలా, కోట, పైథాని, ఆర్గాంజ, కుప్పడం, కాంచీపురం పట్టు చీరలు వంటి ప్రీమియం ఎథ్నిక్ చీరలు, వివాహ, అకేషన్ వేర్ కోసం హ్యాండ్లూమ్లను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తృత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ, అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, లెహంగాలతో పాటుగా పురుషులు మరియు పిల్లల సంప్రదాయ వస్త్ర శ్రేణి సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుందని సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి అన్నారు.