ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – విశాఖ నుంచి భద్రాచలం వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీస్ మరమ్మతులకు గురై సోమవారం లోతుగెడ్డ జంక్షన్, కృష్ణాపురం గ్రామాల సమీపంలో మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖ నుంచి చింతపల్లి మీదుగా గూడెం కొత్త వీధి, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, భద్రాచలం మీదుగా హైదరాబాదు వెళ్లే బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతూ దట్టమైన అటవీ ప్రాంతాలలో ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరమ్మతులకు గురైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్ లను ఈ మార్గం లో నడపడం ప్రమాద భరితమని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.