హైదరాబాద్: స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు హైదరాబాద్లోని హయత్ ప్లేస్లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది. కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో భారతీయ పర్యాటకులలో కనిపిస్తోన్న ధోరణులతో పాటుగా, భవిష్యత్తు లో అభివృద్ధి చెందనున్న ప్రయాణ ధోరణులపై కొంత సమాచారమిచ్చింది. భారతీయ పర్యాటకులు తాము సందర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాలలో స్విట్జర్లాండ్ ఎల్లప్పుడూ తన స్థానం నిలుపుకుని ఉండటంతో పాటుగా తమ అభిమాన వేసవి గమ్యస్థానంగా ఇక్కడి వారికి నిలిచింది. మహమ్మారి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ, కొవిడ్ తర్వాత ఈ దేశం బాగా కోలుకుంది. ఒకప్పుడు వేసవి గమ్యస్థానంగా మాత్రమే పరిగణించబడుతున్న స్విట్జర్లాండ్ ఇప్పుడు అన్ని సీజన్లలో, ముఖ్యంగా శరదృతువులో మాత్రమే కాదు చలికాలంలో కూడా భారతీయ పర్యాటకులచే సందర్శింపబడుతున్నది. యాత్రలు, స్విట్జర్లాండ్లో గతంలో కంటే ఎక్కువగా విస్తరించాయి. స్విట్జర్లాండ్లో గడిపిన ఓవర్నైట్ల సంఖ్యలో 2019 కంటే 2023 మెరుగ్గా ఉంది. వేసవి, శీతాకాలం, స్కీ గమ్యస్థానాలకు విక్రయించబడిన వసతి. ముందస్తుగా బుక్ చేసిన కార్యకలాపాలను మేము చూస్తున్నాం’ అని విలేకరుల సమావేశంలో ఈస్ట్ మార్కెట్స్ చీఫ్ మార్కెట్స్ ఆఫీసర్ సైమన్ బోషార్ట్ అన్నారు. భారతీయులు ఎక్కువగా జ్యూరిచ్, లూసెర్న్ మరియు ఇంటర్లాకెన్ వంటి నగరాలకు వెళతారు, అయితే జెర్మాట్ – మాటర్హార్న్ (స్విట్జర్లాండ్లోని అత్యంత ప్రసిద్ధ పర్వతం) అలాగే ఇటాలియన్ మాట్లాడే ప్రాంతం టిసినో వంటి ప్రదేశాలను కూడా సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు.