Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కుల జన గణన దోపిడీకి అడ్డుకట్ట

ఎం. సురేష్‌ బాబు

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, తిరిగి అధికారంలోకి రావడానికి అధికార పార్టీలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీసీ కుల గణన జరగాల్సిందేనని బీసీ ఉద్యమకారులు, దళిత ప్రజాతంత్ర వాదులు, వామపక్షాలు, మేధావులు డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం పట్టించుకోక పోవడం విచారకరం. కుల గణన అనేది జరిగితే ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుంది. కులగణన చేపట్టక కేవలం ఎనిమిది శాతం ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జనాభాలో 54 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 27 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. దానితో అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు. చట్టసభల్లోనే కాదు గ్రామ, మండల స్థాయి ప్రాతినిధ్యం లేని కులాలు అరవై శాతం వెనుకబడిన తరగతులలో ఉన్నాయి. బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకోవాల్సివుంటుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ సర్కార్‌ ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయబోమని స్పష్టంచేశారు. రిజర్వేషన్లను ఎత్తేసేలా కేంద్రం వైఖరి ఉంది. బీసీ కుల గణనకు చట్టం అనుమతిస్తుందని కోర్టులు కూడా చెప్తున్నాయి, బీసీ జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్‌ కేటాయింపులు ఎలా చేస్తారు. ‘కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కుల గణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బీసీల నుంచి డిమాండ్‌ వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ పని చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దురదృష్టం ఏమంటే ప్రతిపక్షం, అధికార పార్టీలు బీజేపీతో అంటకాగి తిరుగుతున్నాయి. గతంలో ఈడీ, బ్యాంకులను ముంచడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగుదేశం నాయకులు బీజేపీలో చేరి పునీతులయ్యారు. పన్నెండు సంవత్సరాల క్రిందట జన్‌లోక్‌పాల్‌ బిల్లు పెట్టడానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రధాన భూమిక పోషించిన గాంధేయవాది అన్నా హజారే ప్రియ శిష్యులను నేడు మద్యం కుంభకోణంలో ఇరికించారు. సామాన్య మదుపరుల ఆస్తులు లక్షల కోట్లు ఆవిరవుతున్నా, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ రంగం కుదేలవుతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వంలో చలనం లేదు. దేశంలో కుల గణన చేపట్టకుండా, సామాజిక సమగ్రత లేకుండా, మహిళలపై, ముస్లింలపై, రైతులపై, కార్మికులపై దాడులు జరుపుతున్న బీజేపీ ప్రభుత్వంపై నోరుమెదపని నాయకులను ఏమనాలి. జాతీయ ప్రయోజనాలు మరుగుపడినచోట ఉత్పాతాలే మిగులుతాయి. పాఠం నేర్వకపోతే ఏ దేశమైనా మునగక తప్పదు. మన దేశంలో ఆర్థిక వృద్ధి అంచనాలు గత రెండు సంవత్సరాలుగా పేలవంగా ఉన్నాయి ఉద్యోగాలు సృష్టించటమనేది ప్రభుత్వానికి ఎదురయ్యే అతి పెద్ద అవరోధంగా ఉంది. జనాభా రీత్యా ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారతదేశం తన యువ కార్మిక శక్తిని ఇముడ్చు కోవాలంటే ఏటా 1.30 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. అయితే 2016 నవంబర్‌లో చేసిన నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన చిన్న వ్యాపారులు జీఎస్టీ అమలుతో మరోసారి గట్టి దెబ్బతిన్నారు. వాటిలో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో వారు ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో వ్యవసాయం, నిర్మాణరంగం, చిన్న పరిశ్రమలు అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మిక శక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాలలో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వృత్తిదారుల బతుకులు ఉన్నత స్థితికి చేరాల్సిందిపోయి, నీచ స్థితికి చేరడం మొదలయింది.
ప్రజలంతా వారి కుల లెక్కలు తీయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. రూపాయి ఖర్చు లేకుండా కుల గణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ జనాభా లెక్కలు బయటకు వస్తే దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందరూ సమిష్టిగా కేంద్రం మెడలు వంచాలి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. బీసీల పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలి. దేశంలో ఓబీసీల్లో 983 కులాలకు ఐదేళ్లుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతోంది, వ్యవస్థలన్నీ పతనమై పోయాయి, నిరుద్యోగం 8.4 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాళా తీసేలా చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌, రైల్వే, కమ్యూనికేషన్‌, చివరికి ఇస్రో, హెచ్‌ఏఎల్‌ ప్రైవేటు పరం చేస్తున్నారు. ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడాలి. బీసీల్లోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా బలపడాలి. దేశ జనాభాలో 54శాతం బీసీలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బాధాకరం. కులాల లెక్కలు తీయకపోతే బీజేపీ గద్దె దిగి పోవాల్సిందే. ఇప్పటివరకు వారి వాటాతో పాటు బీసీలకు వచ్చే వాటా కూడా అనుభవిస్తున్నారు. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ’’ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(4), 16(4) లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుంచి వచ్చాయి. రిజర్వేషన్‌ కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతా తారుమారు అవుతోంది. మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ఓబీసీల జనాభా 54% , అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10 శాతం రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్లు లేదు. తీర్పు వెలువరించే ముందు ఓసీ జనాభా లెక్కలను సుప్రీం శాస్త్రీయంగా పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పును వెనుకబడిన తరగతులు అనుకూలంగా మలచుకుని జనాభా దామాషా ప్రకారం ఓబీసీ లకు 54%రిజర్వేషన్ల కోసం పోరాడాలి. సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి, వేరే అంశాలు పక్కన పెట్టి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. అన్ని సామాజిక, రాజకీయ శక్తులు,
సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి. భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే ఆరెస్సెస్‌ అజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు చర్యలు తీసుకోవాలి. ఫాసిజం, నియంతృత్వం మధ్య గుణాత్మక వ్యత్యాసం మసకబారుతోంది. ఫాసిజం కూడా నియంతృత్వమే, కానీ ప్రతి నియంతృత్వం ఫాసిజం కాదు. ఫాసిజం సమాజంలో కొన్ని విభాగాలను మైనారిటీ వర్గాలు ‘ఇతరులు’గా ప్రదర్శిస్తుంది. ఇది మైనారిటీలను ‘మెజారిటీ ప్రజలకు’ శత్రువులుగా చిత్రీకరిస్తుంది. ఇది దేశ అభివృద్ధికి అవరోధాలుగా, దేశ భద్రతకు ముప్పుగా చూపుతోంది.’ ఫాసిస్ట్‌ శక్తులు మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజానీకాన్ని సమీకరించి జాతి ప్రక్షాళన వరకు కూడా వెళ్తాయి. ఈ దేశ మూలవాసుల సంస్కృతి, ఆర్థిక శక్తిని ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపినప్పుడే బహుజనులు బాగుపడతారు. దళితులు, దళితేతరుల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తున్న హైందవ పార్టీల ఆటకట్టించాలి. వెనుకబడిన తరగతులు, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీతో కలిసి ప్రాతినిధ్యం లేని కులాలు సంఘటితమై ముందుకు నడవాలి. సీట్లు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి.

అధ్యక్షులు, గౌతమ్‌ బుద్ధ అభివృద్ధి సమాఖ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img