విశాలాంధ్ర -పామిడి ; పామిడి పట్టణలోని షాదిఖానా నలో శనివారం నాడు ఆల్ ఇండియా తంజిమ్ ఏ ఇన్సాఫ్ కమిటీ సమావేశం ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు కె రహీం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు జాఫర్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు గోల్డ్ భాష,, హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సోదరులారా వివాదాస్పదమైన పౌరసత్య సవరణ చట్టం సి ఎ ఎ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని పిలుపునిచ్చారు.1995 నాటి పౌరసత్వ చట్టానికి మోడీ సర్కార్ వివరణలు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్. బంగ్లాదేశ్. పాకిస్తాన్ దేశాలు నుండి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు ఆశ్రమం ఇచ్చేందుకు ప్రతిపాదించిన సి ఎ ఎ బిల్లును దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకమైన ఐక్యతమైనప్పటికీ 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదపరిచింది.తీవ్ర నినాదాల మధ్య వాదన పడిన సి ఎ ఎ చట్టాన్ని మార్చి నెల నుండి అమలు చేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పురాతకంగా వ్యవహరిస్తుంది ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసే సి ఎ ఎ అమలు నిర్ణయాన్ని తక్షణమే విరవించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ కమిటీ నంబరు పి అస్లం ఖాన్, ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు జక్రియ సాహెబ్, ఈదుగా మసీదు ముత్తు వలి బారన్ సాబ్, కిల్లా జామియా ముత్తువలి మసీదు బి కె రహీం, పామిడి మైనార్టీ నాయకుడు బి కె అన్వర్, సిపిఐ వీరభద్ర స్వామి, సిపిఐ మండల కే నాయకుడు నాగరాజు, ముస్లిం, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు…