ఉపాధ్యక్షులు ఎం. కృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం:: 2024 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఫోటోలు వీడియోలు తీయడానికి మా అసోసియేషన్కు అవకాశం కల్పించవలసినదిగా ధర్మవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం. కృష్ణ.,కార దర్శి ఏవి రమణ, సహకార దర్శి ఎస్ శిక్షావలి కోశాధికారి విశ్వనాథ్, తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకట శివరామిరెడ్డికి వారి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం అసోసియేషన్ ఉపాధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి రమణ మాట్లాడుతూ ప్రతి ఎన్నికలకు ఫోటో అండ్ వీడియో అవసరాలు ఎక్కువగా ఉంటాయని, ఈసారి మా అసోసియేషన్కు అవకాశం కల్పించవలసినదిగా వారు తెలిపారు. అనంతరం ఆర్డీవో స్పందిస్తూ జిల్లా అధికారులతో మాట్లాడి తమకు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పాల్గొన్నారు.