Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి

తెలుగుదేశం జనసేన బిజెపి విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి గజపతి రాజు అన్నారు. గురువారం అశోక్ బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆనాడుఅన్న ఎన్టీఆర్ పేదల కోసం ప్రతి ఇంటికి రెండు రూపాయలకే 25 కేజీలు బియ్యాన్ని అందజేశారు. అదేవిధంగా రేషన్ డిపోల ద్వారా నిత్యవసర సరుకుల్ని ప్రజలకి అందించారన్నారు. నేడు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన స్త్రీకి నెలకి 1500 , తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15000, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, యువ గళం నిధి కింద ప్రతి నిరుద్యోగి కి నెల కి 3000, ఉపాధి, నిరుద్యోగ యువతకి 20 లక్షలు ఉద్యోగ కల్పన వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. అందుకోసం రానున్న ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో నన్ను గెలిపించి రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడుని మరలా ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆల్తి బంగారు రాజు, నాయకులు ఐవిపి రాజు, రాజేష్ బాబు, పిళ్ల విజయ్ కుమార్, కంది మురళి నాయుడు, ఈగల సత్యారావు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img