Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

పది ఫలితాల్లో జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణతను సాధించారు. పాఠశాలలో చదివిన వజ్ర కరూర్ మండలం చాబాల గ్రామానికి చెందిన ఇస్రాత్ భాను 583 మార్కులను సాధించింది అలాగే హేమంత్ కుమార్ 577, రోహిత్ నాయక్ 573 అత్యధిక మార్కులను సాధించి పాఠశాల యొక్క ప్రతిష్టతను పెంచారు. అత్యధిక మార్కులు సాధించిన ఇస్రాత్ భానును, హేమంత్ కుమార్, రోహిత్ నాయక్ లు ను విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులను సాధించి మా పాఠశాల యొక్క ప్రతిష్టను పెంచేందుకు కృషిచేసిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img