Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

భారీ జన సందోహం మధ్య టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ బుధవారం భారీ జన సందోహం మధ్య నామినేషనను దాఖలుచేశారు. నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ కు అందజేశారు.అనంతరం కేశవ్ భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు పసుపు జెండాలను పట్టి పయ్యావుల నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కవిత హోటల్ సమీపంలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి కేశవ్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమన్నారు.వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చెయ్యలేని అసమర్ధుడు అన్నారు. తాను నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img