ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటు వేశారు అనే కారణంతో మండల పరిధిలోని గొల్లమూడి గ్రామానికి చెందిన బరికెల రంగమ్మకు పనికి ఆహార పథకం పని కల్పించకుండా తమను నిరీక్షింప చేస్తున్నారని శుక్రవారం ఆమె నందిగామ మండల డెవలప్మెంట్ కార్యాలయ అధికారులకు, పనికి ఆహార పథకం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఈ విషయంపై వెంటనే ఉన్నతాధికారులు సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ను పిలిపించి విచారించి రంగమ్మ కు పనికి ఆహార పథకం పనులు వెంటనే కల్పించాలని ఆదేశించారు సదరు ఫీల్డ్ అసిస్టెంట్ పై శాఖాపరమైన వివరణ కోరిగా ఫీల్డ్ అసిస్టెంట్ కు ఎన్నికల విధులు నిర్వర్తించిన క్రమంలో కొందరికి పనికి ఆహార పథకం పనులు కల్పించే జాబ్ కార్డు అందించుటలో ఆలస్యమైనట్లు వివరణ ఇచ్చినట్లు ఏపీవో తెలియజేశారు,శనివారం ఉదయం నుండి ఆమె ఉపాధి హామీ పథకం కింద విధుల్లో పాల్గొన్నారు విధులు కూడా ఆమెకు విడుదల చేయనున్నట్లు ఏపీవో తెలిపారు