–– జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర – అనంతపురం : సుదీర్ఘంగా పనిచేసి ప్రజలకు మీరు అందించిన సేవలు పోలీసుశాఖ ఎన్నటికీ మరువదని జిల్లా ఎస్పీ గౌతమిసాలి పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవల 9 మంది పదవీ విరమణ చేశారు. వీరిలో మంగళవారం ఏడుగురికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సన్మానం చేశారు. పదవీ విరమణ పొందిన ఎస్సై వెంకటాచలపతి, ఏఎస్సైలు నాగరాజు, సయ్యద్ ఇబ్రహీం, జనార్ధన్, ఏఆర్ఎస్సై ఖాదర్ బాషా, శంకర్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ గౌస్ పీరాల దంపతులను ఎస్పీ పూలమాలలు, సాలువాలతో సత్కరించారు. ఈసందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా … పదవీ విరమణ చేసిన సిబ్బంది క్షేమ సమాచారాలు అడగటంతో పాటు పిల్లలు ఎంత మంది, వారి ఏమి చేస్తున్నారు, తదితర వివరాలు తెలుసుకున్నారు. పదవీ విరమణ అనేది అందరికీ తప్పదని…ఎలాంటి రిమార్క్స్ లేకుండా నాలుగు దశాబ్దాలు పని చేయడం విశేషమని ఎస్పీ అభినందించారు. శేష జీవితం సుఖసంతోషాలతో గడపండి… ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫెన్షన్ ద్వారా వచ్చే సొమ్ముతో మీ అవసరాలకు ఖర్చు పెట్టుకోవాలన్నారు. మీకు ఇంకా ప్రభుత్వం నుండీ అందాల్సిన ప్రయోజనాలు గానీ, పెన్షన్ విషయంలో గానీ ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్.విజయభాస్కర్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, మధు, ఆర్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, జాఫర్, గాండ్ల హరినాథ్, శ్రీనివాసులనాయుడు, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.