విశాలాంధ్ర – ధర్మవరం : ఈ ఏపీ సెట్ ఫలితాలలో పట్టణంలోని వాసవి బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని పంచాంగం సుప్రియ ఎంసెట్ ఫలితాలలో 2702 వా ర్యాంకును సాధించి అవురా అనిపించింది. వాసవి కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన సుబ్రహ్మణ్యం, వీణరాణి దంపతుల కుమార్తె వాసవి బాలికల జూనియర్ కళాశాలలో కూడా చదువులో కూడా అత్యంత ప్రతిభ కనపరచడం జరిగిందని తెలిపారు. అనంతరం సుప్రియ కు ఇంతటి ర్యాంకు సాధించినందుకు శుభాకాంక్షలు తో పాటు మిఠాయిని తినిపించారు. ఈ ర్యాంకు రావడానికి కృషిచేసిన అధ్యాపక బృందానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సుప్రియ మాట్లాడుతూ తాను ఉత్తమ ఇంజనీర్ కావడమే లక్ష్యంగా తాను చదువును కొనసాగిస్తున్నానని తెలిపారు. మొత్తం మీద ఒక బ్రాహ్మణ కులములో ఈ ర్యాంకు రావడం పట్ల బ్రాహ్మణ సంఘం కూడా ఆశ్రం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శివశంకర్, అధ్యాపక, బోధ నేతర సిబ్బంది, తోటి విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.