బిజెపి నాయకుడు డోలా రాజారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవడం రాజకీయ చరిత్రలో ఒక మరుపురాని సంఘటన అని, చరిత్రలో ఒక కీలకమైనదిగా బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు విజయవాడలోని సత్య కుమార్ యాదవ్ స్వగృహంలో వారు స్వయంగా కలిసి, పుష్పగుచాన్ని ఇచ్చి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశా
రు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే నియోజకవర్గ ప్రజలు ఎన్నో కష్టాలను ఎదురుకోవడం జరిగిందని, నేడు ఆ సమస్యలకు పరిష్కారం సత్య కుమార్ ద్వారానే జరుగుతుందని తెలిపారు. ఒక బీసీ అభ్యర్థి 56 సంవత్సరాల తర్వాత ధర్మవరంలో ఎమ్మెల్యే కావడం నిజంగా అదృష్టమన్నారు. వారి వెంట ప్రజల సమస్యల కొరకై తాను ఎల్లప్పుడూ ఉంటానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.