బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయకుడు సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: తాను బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన, ఓడిపోవడం జరిగిందని, ఓటమిని అంగీకరిస్తూ.. మున్ముందు ప్రజా సమస్యలపై తప్పక పోరాడుతానని బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సాకే వినయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నాపై నమ్మకంతో ఓట్లు వేసి నా ఓటర్లకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నా వెంట నడిచిన బీఎస్పీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజల తరఫున పోరాటం చేయడం నాకర్తవ్యమని, గడిచిన ఎన్నికల్లో నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ప్రచారాలను అడ్డుకొని ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికై తాను నిరంతరం పోరాడుతానని తెలిపారు.