ఎన్ఎస్యుఐ.జిల్లా అధ్యక్షులు ఇడపబత్తిని ప్రసాద్
విశాలాంద్ర ధర్మవరం:: “నీట్”ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఈడపబత్తిని ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ 2024 నీట్ పరీక్ష ఫలితాల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి అనేక అనుమానాలు వారి వ్యక్తమవుతున్నాయని, పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని వారు ఏంటి పోయింది డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్టిటిఎ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రం ఉన్న, ఒకే సీరియల్ నెంబర్లతో కూడిన ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. లక్షలాదిమంది విద్యార్థులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మందివిద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక నీట్ పరీక్ష నిర్వహణ ఎన్టిఎ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు గణేష్, ఆదర్శ్ కుమార్, మహేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.