జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా .ఈ బి దేవి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ .బి దేవి అధ్యక్షతన గత మాసంలో జిల్లాలో జరిగిన మాతృమరణాలు మరియు శిశు మరణాల కు గల కారణాలు పైన సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్ మరియు సిబ్బందితో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది..
ఈ సమీక్షా సందర్బంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ… మాతృమరణాలు శిశుమరణాలు నివారించాలని ముఖ్యంగా శిశు మరణం కానీ మాతృ మరణం కానీ జరిగినప్పుడు మరణానికి గల కారణాలు తెలుసుకొని. తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఐ సి డి యస్. ప్రాజెక్టు వారు గర్భిణీ స్త్రీ లకు అందించే న్యూట్రిషన్ ఫుడ్ ను వారు సంపూర్ణముగా తీసుకొనేలా చూసి. రక్త హీనతతో. బాధ పడకుండా చూడాలని ఆదేసించారు ,తల్లీ బిడ్డల వైద్య సేవల విషయం లో. రెండు శాఖ లు. సమన్వయం చేసుకోవాలని కోరారు. మాతృ మరణం జరిగినపుడు జిల్లా నోడల్ టీం కూడా చేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారలు లోపు రిజిస్ట్రార్ చేసుకొని. ,ఆమెకు అన్నిరకాల వైద్య పరీక్షలు. వైద్యసేవలు అందించాలని కోరారు. ఏ తల్లి ప్రసవ అనంతరం అధిక రక్తస్రావంతో మరణించ కూడదని , ప్రతి గర్భిణీ స్త్రీని పరీక్షించాలని. ప్రమాదకర లక్షణాలు వున్న గర్భిణీ స్త్రీల పట్ల తగిన జాగ్రతలు తీసుకొంటూ సుఖప్రసవం జరిగేలా చూడాలని ఆదేశించారు. .
రక్త హీనత వున్నా ,గుండె సంబంధిత సమస్యలు వున్నా ,తక్కువ ఎత్తు ,,తల్లి గర్భం లో ఉమ్మనీరు తక్కవ వున్నా ,బిడ్డ పెరుగుదల లేకపోయిన , హై రిస్క్ గర్భవతులను గుర్తించి వారికీ ప్రత్యేక వైద్యసేవలు అందించాలని కోరారు.ఆశాడే రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రము డాక్టర్స్.వైద్య సిబ్బందికి. గర్భిణీ స్త్రీలకు ,, తల్లి, బిడ్డ కు సంబందించిన ఆరోగ్యం ఫై అవగాహన కల్పించాలని ఆదేశించారు . ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ. అధికారి డాక్టర్ పాల్ రవికుమార్ , జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి. డా. యుగంధర్ ,ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డాక్టర్స్. నవీన్ కుమార్ , రేణుక ,శంకర్ నారాయణ. యం పి హెఛ్ ఈ ఓ లక్ష్మన్న , ఎం పి హెఛ్ యస్ హేమలత , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.