జిల్లా చేనేత జ్యువలరీ శాఖ అధికారి రమేష్.
విశాలాంధ్ర ధర్మవరం:: వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్నాలజీ కోసం నందు ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కోర్సు నందు ప్రవేశం కొరకు 15-23 సంవత్సరాల వయసుగల విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, పదవ తరగతి లేదా సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో పాసైన విద్యార్థులకు, పదవ తరగతితో పాటు ఐటిఐ పాసైన వారికి నేరుగా డిప్లమా సెకండియర్ లో ప్రవేశం కలదని తెలిపారు. షెడ్యూల్ కులాల తెగలకు చెందిన విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు వరకు కలదని తెలిపారు. డిప్లొమా మొదటి సంవత్సరములో నెలకు వెయ్యి రూపాయలు, రెండవ సంవత్సరమునకు ఒక వెయ్యి వంద రూపాయలు, మూడవ సంవత్సరములో ఒక వెయ్యి రెండు వందల రూపాయలు స్టైఫండ్ ఇవ్వబడునని తెలిపారు. ఈనెల 20వ తేదీ నుండి జరుగు రెండవ దశ కౌన్సిల్ లకు విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9866727042 కు లేదా 8185881331 లేదా 9866169908 కు సంప్రదించాలని తెలిపారు.