ఆర్డిఓ వంశీకృష్ణ
విశాలాంధ్ర కదిరి.(సత్యసాయి జిల్లా) నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారుల సమిష్టి కృషితో బాల్యవివాహాల రహిత రెవిన్యూ డివిజన్ గా తీర్చి దిద్దుదామని ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో మహిళా
భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల్య వివాహాల నియమ నిబంధనలు,బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టాలపైఅన్ని శాఖల అధికారులకు శిక్షణ కల్పించారు. లక్ష్మీ కుమారి పథక సంచాలకులు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్ల్లా అధ్యక్షులు లక్ష్మీ కుమారి, డి.ఎస్.పి శ్రీలత హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం ఏపీ బాల్య వివాహాల నియమ నిబంధనలు రెవిన్యూ డివిజన్లో అమలు జరిగేల చూడాలని కోరారు. ప్రతి గ్రామంలో బాల్య వివాహాలను నిరోధించాలని, బాల్యవివాహాల మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని మండల అధికారులకు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బాల్య వివాహాలకు సంబంధించి, బాలల చట్టాలకు సంబంధించి సమన్వయం జరిగేలా అన్ని శాఖల పనిచేయ్యాలని కోరారు. బాలల చట్టాలపై ప్రతి పాఠశాలలో అవగాహన కల్పించాలన్నారన్నారు. బాల్య వివాహాలు నిలుపుదల చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిసిపిఓ మహేష్ బాల్య వివాహాల నిరోధక చట్టం పైన పిపిటి తెలియజేశారు
ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈఓలు ఎస్సైలు సిడిపిఓ రాధిక,రెడ్స్ స్వచ్ఛంద సంస్థ భానుజా పాల్గొన్నారు.