విశాలాంధ్ర- అనంతపురం : ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ (ఏపీ హంస ) అనంతపురం నగర శాఖ కార్యవర్గ ఎన్నికలు నగరంలో ని పాత ఊరు సీడీ హాస్పిటల్ నందు శుక్రవారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా కన్వీనర్లు ఎస్ ఎండీ . షఫీ మరియు కోకిల చాముండేశ్వరి అధ్యక్షత న ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెపల్లి పామన్న ఎన్నికల పరిశీలకులగా వ్యవహరించారు, అలాగే వెంకట కృష్ణమూర్తి మరియు పి.లక్ష్మి ఎన్నికల అధికారులు గా వ్యవహరించారు. ఇందులో ఈ క్రింది వారు నగర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రసిడెంట్ గా కుళ్ళయ బాబు(ఫార్మశిస్ట్), అసోసియేట్ ప్రసిడెంట్ శోభా రాణి, (నర్సింగ్ కాలేజి బోధకురాలు), వైస్ ప్రసిడెంట్ లు గా అలివేల మంగమ్మ, (స్టాఫ్ నర్స్ జీ జీ హెచ్ ) గిరిధర్ రెడ్డి( ఎంపీహెచ్ ఈ ఓ ), రామాంజినేయులు, (మెడికల్ కాలేజి యూడీసీ ),తిప్పే రుద్రమ్మ, (స్టాఫ్ నర్స్ జీ జీ హెచ్ ) అంజనమ్మ, (స్టాఫ్ నర్స్ జీ జీ హెచ్ ) సెక్రటరీ లు గా భక్తర్ అలీ ఖాన్, (డిప్యూటీ డి ఎస్ ఓ ,) విశాలాక్షి, (ట్రైనింగ్ స్కూల్ పి హెచ్ ఎన్ ), S. లోకేశ్వర్ రెడ్డీ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ట్రెజరర్ గా ఎల్లప్ప, (ఎంపీహెచ్ ఈ ఓ ట్రైనింగ్ స్కూల్), జాయింట్ సెక్రటరీ లు గా కె .సుదర్శన్ రెడ్డి (కాంపౌండర్ ఆయుష్) ఉమాదేవి, (స్టాఫ్ నర్స్ మెడికల్ కాలేజి )జమున స్టాఫ్ నర్స్ సంధ్య అరుణ,(స్టాఫ్ నర్స్ ఫ్యామిలీ ప్లానింగ్) మంజుల దేవి( డి ఎల్ ఓ ఆఫీస్ అటెండర్)ఎంపిక అయ్యారు.
హంస జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖా ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకమవ్వాలన్నారు. సంఘావిష్కరణ నుండి తోడుగా నిలుస్తున్న వైద్యారోగ్య ఉద్యోగులు, నిజాయితీపరులు ఉద్యోగుల డిమాండ్ల సాధనలో నిర్విరామంగా సేవలందించగలిగిన వారికి మాత్రమే కార్యవర్గంలో అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో వైద్య సిబ్బంది సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వైద్య ఉద్యోగులకు అండగా ఏపీ హంస రాష్ట్ర, జిల్లా, తాలూకా కార్యవర్గాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.