ఏపీ రైతు సంఘం అనంతజిల్లా సమితి రైతులకు పిలుపు
ఏపిరైతుసంఘము అనంతపురము జిల్లా కార్యవర్గ విసృతస్థాయి సమావేశము సీపీఐ జిల్లా కార్యాలయం నందు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపి రైతు సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున మాట్లాడుతూ… జిల్లా రైతు జిల్లా రైతు సంఘం ఈనెల 22వ తారీఖున ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరు ఎద్దులతో నాగళ్ళు, మడకలతో వ్యవసాయ సాగును ప్రారంభిద్దాం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అని తెలియజేశారు. ప్రభుత్వం తరఫున రైతులకు కౌలు రైతులకు సబ్సిడీతో రైతులకు నూతన వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి పంటలువేసేనాట్లు, కోతల నూర్పుడి యంత్రాలు ,మైక్రో ఇరిగేషన్ పరికరాల కోసం 70% రాయితీని అందించాలి, రైతులుకు అవసరమైన పెట్రోల్ డీజిల్ 50 శాతం సబ్సిడీపైరైతులకు ఇవ్వాలన్నారు. రైతులకు కౌ రైతులకు వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణం అందించాలి వారు పేర్కొన్నారు. 5 లక్షల వరకు పావలా వడ్డీ పై రుణం రైతులకు అందించాలి, ఆర్.బి ఐనిబంధన ప్రకారం ఒక లక్ష 60 వేల రూపాయలుకౌలురైతులకు అందించాలన్నారు. రైతాంగానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సూక్ష్మ పోషకాలు 90 శాతం సబ్సిడీతో రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలన్నారు. ఉఫాధీహమీపథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సాగు ప్రణాళికలతో పాటు అన్ని పంటలకు లాభదాయక ధరలు నిర్ణయించి ప్రకటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టి నకిలీ విత్తనాలు అమ్మే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణాలను అందించాలన్నారు. పాడిపశువులకు గొర్రెలకు మేకలు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని, అనేక రైతాంగ అంశాల పైన విసృతస్థాయికార్యవర్గ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమస్యల పైన దశల వారిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతపురం జిల్లా సమితి అగ్రభాగంలో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ వన్నారెడ్డి, రైతు సంఘం కార్యవర్గ సభ్యులు టీ నారాయణస్వామి, జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి సనప రామకృష్ణ, జిల్లా రైతుల సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటరాముడు యాదవ్, నరసింహులు, నాగేష్, చలపతి, రామాంజనేయులు యాదవ్, వెంకట్ రాముడు, జిల్లా రైతు సంఘం కౌన్సిల్ సభ్యులు మధు యాదవ్, అంజి, ఆదినారాయణ, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.