విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రక్త బంధం ఆర్గనైజేషన్ సంస్థ నిర్వాహకులు కన్నా వెంకటేష్ 24 సార్లు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్త బంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాల నుంచి అనంతపురం, కడప, కర్నూల్ మా మిత్రుల ద్వారా ఇప్పటివరకు 4500 పైగా బ్లడ్ క్యాంపు ద్వారా, అంతేకాకుండా బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ లో తల సేవియా చిన్నారులకు అనునిత్యం రక్తదాతలను పంపించడం జరుగుతోందని తెలిపారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ధర్మారం నుంచి అనంతపురం దీపు బ్లడ్ బ్యాంకుకు వచ్చి తన ఓ పాజిటివ్ రక్తాన్ని 24వ సారి ఇవ్వడం నాకెంతో సంతోషాన్ని తెలిపారు. నా పుట్టినరోజున సందర్భంగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం నాకెంతో తృప్తినిచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు 24 రక్త దానాలు 22 తెల్ల రక్త కణాలు మొత్తం 46 సార్లు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా రక్తదానం చేస్తామని తెలిపారు. అనంతరం బ్లడ్ బ్యాంకు సిబ్బంది, రక్త బంధం ఆర్గనైజేషన్ సిబ్బంది కన్నా వెంకటేశులు అభినందించారు.