ధర్మవరం అసెంబ్లీ బిజెపి కన్వీనర్ గోపాల్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూముల వ్యవహారం కుంభకోణం ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా గత ప్రభుత్వ అధికారులు చేయడం జరిగిందని ధర్మవరం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ జి.గోపాల్ రెడ్డి దుయ్యపట్టారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం మండలాల్లో భూమిలేని నిరుపేదలను గుర్తించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది అని మండిపడ్డారు. అందులో భాగంగా వారికి కావలసిన వైవీపీ నేతలకే భూములను కట్టబెట్టారు అని తెలిపారు. అందులో భాగంగా కొన్ని లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది అని, దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా వెయ్యి ఎకరాల పైన అక్రమాలు జరిగాయి అని వారు ఆరోపించారు.
ఈ వ్యవహారం అంతా అధికారుల కను సన్నల్లోనే జరిగింది అని, కావున గత వైసిపి ప్రభుత్వం లో ఇచ్చిన పట్టాలను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు వై సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా భూమిలేని నిరుపేదలను గుర్తించి, సాగుకు పనికొచ్చే భూములను వారికి కేటాయించవలసిందిగా ధర్మవరం నియోజకవర్గం బిజెపి నాయకులు డిమాండ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తప్పు చేసిన అధికారులను గుర్తించి, వారి పైన చర్యలు తీసుకుని, తగిన శిక్ష విధించాల్సిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు జింక చంద్రశేఖర్, ఓబులేసు, జిల్లా సీనియర్ నాయకులు కావేటి మల్లికార్జున, గొట్లూరు రామకృష్ణ , కృష్ణ ప్రసాద్, పోతలయ్య, జల్లా కార్తీక్ , తదితరులు పాల్గొన్నారు.