ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మొత్తం పది గదులకు వ్యాపారం కొరకు టెండర్లను నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల గడువుతో వ్యాపార నిర్వహణకు గాను ఆసక్తి గల వ్యాపారస్తులు షీల్డ్ టెండర్లను వేయాలని తెలిపారు. టెండర్ల ధరావత్తు వ్యాపారమును బట్టి పదివేల నుండి 1,00,500 వరకు ఉంటుందన్నారు. ఆసక్తి కలవారు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు డిపో మేనేజర్ కార్యాలయము నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు రూ.885 చెల్లించి టెండర్ ఫారం ను పొందవచ్చునని తెలిపారు. పూరించిన టెండర్ ఫారం ను ఈనెల 27వ తేదీ జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయం పుట్టపర్తి నందు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు టెండర్ బాక్సు నందు వేయాలని వారు తెలిపారు. తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు తెరువబడునని అని తెలిపారు. ఈ అవకాశమును ఆసక్తి గల వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకొని వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్టీసీ ఆదాయానికి సహకరించాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959225859 కు గాని 7382861410 కు గాని 7382860501 కు గాని సంప్రదించాలని తెలిపారు.