జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : రేపటి దేశ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం చిన్నారులను బడికి పంపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో బడి బయట ఉన్న పిల్లలందరూ బడిలో చేరాలనే నిదాదంతో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం – 2009కి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి దేశ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం మన చిన్నారులను ఈ రోజు నుండే బడికి పంపుదాం, మన అమ్మాయిలను చదువుకోనిద్దాం, జీవితంలో ఎదగనిద్దామని సూచించారు. ప్రతి చిన్నారిని బడికి పంపించడంలో జిల్లా యంత్రాంగానికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం – 2009 సంబంధించి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలని, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు జరిగే సమయంలో వివాహం జరగకుండా అడ్డుకున్న తర్వాత సంబంధిత పిల్లలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న చైల్డ్ లేబర్ రెస్క్ డ్రైవ్ లో బాల కార్మికులుగా గుర్తించిన పిల్లలను తిరిగి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు బాల కార్మికులను విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సంబంధిత బాలలను తిరిగి స్కూల్లో చేర్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ రామకృష్ణారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.ఎన్ శ్రీదేవి, బాలల పరిరక్షణ సమితి అధికారి మంజునాథ్, ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ (1098) కృష్ణమాచారి, డిసిపియు సిబ్బంది వెంకట్ కుమార్, డిఇఓ నాగరాజు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.