రజక సాధికార కమిటీ హిందూపూర్ పార్లమెంట్ కన్వీనర్ మాల్యవంతం నారాయణస్వామి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రజక సాధికార కమిటీ హిందూపూర్ పార్లమెంట్ కన్వీనర్ మాల్యవంతం నారాయణస్వామి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ రజకులు కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్యకు, ధర్మవరం పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో రజకుల సమస్యలు ప్రభుత్వాలు మారిన సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. అదేవిధంగా రజకులకు దోబీ ఘాట్లు, ఉచిత విద్యుత్తు, కమ్యూనిటీ హాల్ అందేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. అనంతరం కమతం కాటమయ్య పరిసే సుధాకర్లు మాట్లాడుతూ మీ సమస్యలను ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమస్యను విన్నవించి పరిష్కారం అయ్యేలా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇరువురున్ని శాలువా , పూలమాలలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బద్దలాపురం నరసింహులు, మస్తానప్ప , రామాంజనేయులు , ముత్యాలప్ప , మూర్తి , సాకే రమేష్ రాధాకృష్ణ , మాల్యవంతం వెంకటేష్ , మురళి, రాజు , సీనప్ప , నాగరాజు , వెంకటేశు , గణేష్ , బాలాజీ , భాస్కర , ఆక్కులప్ప , రమేష్ తదితరులు పాల్గొన్నారు.