వక్త విభాగ ప్రచారం కు వివేకానంద
విశాలాంధ్ర ధర్మవరం;; హిందూ సామ్రాజ్య దినోత్సవం, చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం వేడుకలు పట్టణంలోని సంజయ్ నగర్లో గల ఈఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో అత్యంత వైభవంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి విభాగ ప్రచార ప్రముక్ వివేకానంద ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య దినోత్సవం శివాజీ యొక్క పట్టాభిషేకం యొక్క వివరాలను వారు సంపూర్ణంగా తెలియజేశారు. శివాజీ హిందువుల పౌరుష పరాక్రమాలను లోకానికి వెల్లడించాడని, శివాజీ పట్టాభిషేకం అయిన రోజునే హిందూ సామ్రాజ్య దినోత్సవం గా నేడు మనమందరము జరుపుకోవడం నిజంగా సంతోషించేదగ్గ విషయము అని తెలిపారు. జూన్ 1674లో శివాజీ పట్టాభిషేక్తుడైనడని తెలిపారు. ఈ ఘటన భారతదేశంలో హైందవి స్వరాజ్యానికి నాంది పలికిందని తెలిపారు. మిద్ద తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలన విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగన్యుడు అని తెలిపారు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రాన్ని కచ్చితంగా పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి ఖర్చు చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడిన మహా వ్యక్తి శివాజీ అని తెలిపారు. అప్పట్లో శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడని హిందూ దేవాలయాలతో పాటు ఎన్నో మసీదులు కూడా కట్టించారని తెలిపారు. శివాజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, భారతదేశ అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ప్రముఖులు, విశ్వహిందూ పరిషత్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.