విశాలాంధ్ర- తనకల్లు : ఏరువాక పౌర్ణమి రైతులకు పండుగ రోజు అని అలాంటి పండుగ రోజు రైతు నిస్సహాయ స్థితిలో ఉన్నాడని రైతు కష్టాలను తీర్చడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని మండల రైతు సంఘం నాయకులు చౌడప్ప యాదవ్ కరీముల్లాలు తెలిపారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా వృషభ రాజులను అలంకరించి తొలకరి వర్షాలకు సాగులోకి వచ్చిన భూమిని దున్ని కష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలకు ఉపశమనం కలగాలని కోరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు సమస్యలను పెడచెవిన పెట్టి రైతులకు ఇబ్బంది కలిగే ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి తగిన మూల్యం చెల్లించుకోందని ఇప్పుడున్న ప్రభుత్వమైనా రైతు సమస్యలపై దృష్టి సారించాలన్నారు ముఖ్యంగా బ్యాంకులో ఉన్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసి రైతు పండించిన పంటకు గిట్టు బాటు ధరలు కల్పించి పెట్టుబడి సహాయాన్ని వెంటనే ఇవ్వాలన్నారు ఉచిత విద్యుత్ సహా డ్రిప్ ఇరిగేషన్ 90 శాతం సబ్సిడీతో అందివాలన్నారు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేసి 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులతోపాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.