విశాలాంధ్ర -తనకల్లు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్, తన ఎమ్మెల్యే పదవికి అసెంబ్లీ లో ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్డు, పంపిణీ కార్యక్రమాన్ని తెలుగు యువత మండల అధ్యక్షుడు కావడి ప్రవీణ్ కుమార్, ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేసిన గండికుంట వెంకటప్రసాద్, 2009వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కానీ రాష్ట్రంలో అధికారం మాత్రం కాంగ్రెస్ చేపట్టింది. అనంతరం 2014 సంవత్సరంలో పోటీ చేయగా స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థి పార్టీ గెలిచింది. 2019వ సంవత్సరంలో మళ్లీ ఓటమి పాలయ్యాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించాడు. ఎమ్మెల్యేగా ఆయన గెలుపొంది రాష్ట్రంలో అధికారంలో ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో కదిరి ప్రజలకు రుచి చూపిస్తాడని, అభివృద్ధి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కదిరి నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాడని, ఆయన తెలిపారు. ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా శ్రీ ద ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కేవలం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసే ఇటువంటి వ్యక్తి కదిరి ఎమ్మెల్యేగా గెలుపొందడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి కుంచె నాగేంద్ర ప్రసాద్ తెలుగు యువత మండల అధ్యక్షుడు కావడి ప్రవీణ్ కుమార్, పీజీ మల్లికార్జున, బాగేపల్లి అశోక్,తోట సరోజమ్మ మహబూబ్ బాషా, దస్తగిరి, మల్లెపూల రవి, వార్డ్ మెంబర్ తీరుపల్లి దామోదర్ తోట కిషోర్ ప్రసాద్ మురళి చిన్నప్ప చంద్రప్ప, డేగానిపల్లి శంకర్ నాయుడు, మాధవరెడ్డి వాల్మీకి వినోద్ వందేమాతరం నవీన్, తనకల్లు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.