ఆచార్య సి. షీలారెడ్డి
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురంలోని జె ఎన్ టి యూ ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎస్. ఎ. కోరీ నేతృత్వంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశేషంగా జరుపుకున్నారు. వర్శిటీ ఉపకులపతి, ఆచార్య ఎస్. ఎ. కోరి మాట్లాడుతూ… విద్యార్థుల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం ఇటువంటి కార్యక్రమాలను తరచుగా ఏర్పాటు చేస్తూ వారి నిబద్ధతను చాటుకుంటున్నారు.
యోగాభ్యాసం ఉదయాన్నే ఉత్తేజకరమైన ఆసనాలతో, శ్వాస సంబంధిత వ్యాయామాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వర్శిటీ డీన్ ఆచార్య సి. షీలారెడ్డి మాట్లాడుతూ విద్య, వృత్తిపరమైన జీవితంలో ఒత్తిళ్ల మధ్య సమతుల్య జీవనశైలిని పెంపొందించడంలో యోగా పాత్రను వివరించారు. “యోగా అనేది కేవలం శారీరక అభ్యాసం కాదు; ఇది మానసిక శాంతి మరియు సామరస్యాన్ని సాధించే దిశగా సాగే ప్రయాణం” అని పేర్కొన్నారు. హాజరైన వారందరినీ వారి దినచర్యలలో యోగాను చేర్చుకోమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం సామూహిక ధ్యానంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.