విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా కలెక్టరేట్ నందు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలుపరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం( పి సి పి ఎన్ డి టి యాక్ట్ )అమలుకు సంబంధించి జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ… పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కాన్ సెంటర్ యాక్ట్ ప్రకారం నిర్వహించే విధంగా వైద్య ఆరోగ్యశాఖ తగు చర్యలు చేపట్టాలని తెలిపారు ముఖ్యంగా స్కాన్ సెంటర్స్ నందు సెక్స్ డిటెక్షన్ జరగకుండా చూడాలన్నారు స్కాన్ సెంటర్స్ లో పనిచేసే డాక్టర్స్ కు మరియు ఇతర సిబ్బందికి పి సి పి ఎన్ డి టి యాక్ట్ కు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూడాలన్నారు. వీరికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆడైనా మగైనా ఒకటే అను విషయాన్ని ప్రజలందరూ కు కూడా అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు స్కాన్ మిషన్స్ ద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడాని కె తప్ప కడుపులో పెరుగుతున్నది ఆడ మగ అని తెలుసుకోవడానికి కాదని అవగాహన కల్పించాలన్నారు. ఏ స్కానింగ్ సెంటర్లో అయినా సెక్స్ డిటెక్షన్ జరిగినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆడపిల్ల యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేయాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్స్ ,బస్టాండ్సు ,సినిమా హాల్స్ , మొదలగు పబ్లిక్ ప్రాంతాల్లో ఈ చట్టం పైన అవగాహన కలిగించాలన్నారు, ఇదే సందర్భంలో మాతృ మరణాలు జరగడానికి గల కారణాలను నిశితంగా పరిశీలించి వాటిని అరికట్టడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ బి దేవి, ఆర్డిటి సంస్థ హెల్త్ డైరెక్టర్ సిరప్ప, పి సి పి ఎన్ డి టి నోడల్ అధికారి డాక్టర్ యుగంధర్, మాస్ మీడియా అధికారి ఉమాపతి , ఉప డెమో త్యాగరాజు ,గంగాధర్ వేణుగోపాల్ ,లీగల్ అడ్వైజర్ ఆషారాణి, వెంకటేష్, శ్రీకాంత్ మొదలగురు పాల్గొన్నారు.