విశాలాంధ్ర – అనంతపురం : పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వివేకానంద యోగ కేంద్ర మరియు యోగసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులో యోగ నేర్చుకున్న విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో నెగ్గిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ శుక్రవారం బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వివేకానంద యోగా కేంద్రం, యోగాసనా స్పోర్ట్స్ నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి, దివాకర్, మారుతి ప్రసాద్ లను యోగ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని పోటీలో పాల్గొని అనంతపూర్ జిల్లాకు పథకాలను తీసుకొని రావాలన్నారు. వివేకానంద యోగ కేంద్రం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ … ఏప్రిల్ 27వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు అనంతపురం నగరంలోని వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సుమారు 100 మందికి నాలుగు చోట్ల 45 రోజులు పాటు రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు కావలసిన శిక్షణ ఇవ్వడము జరిగిందన్నారు. వివేకానంద భవన్ సెంటర్ లో పరమేశ్వర రెడ్డి ,మొంటస్సరీ స్కూల్లో కృష్ణ, సోమనాథ్ నగర్ లోని బిఎస్ఎన్ఎల్ భవన్ లో గురు రాజారావు ,రామ్ నగర్ లో ఎం పుల్లయ్య మొదలగు టీచర్ల చే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఈ.పోటీలలో
బాలికల విభాగంలో లాస్య విజయ రెడ్డి ,సుదీర్షారెడ్డి ,సుమన, విశ్వాని , బ్రహ్మీని,శ్రావ్య బహుమతులు సంపాదించారు అదేవిధంగా బాలుర విభాగంలో యజ్ఞరూప్ యాదవ్ ,విగ్నేష్ ,వినయ్, సుశాంత్ ల కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మోమెంటో మరియు సర్టిఫికెట్లు , పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు.