విశాలాంధ్ర – ధర్మవరం:: 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బీఎల్ఓ లగా పనిచేసిన 287 మందికి రావలసిన రెమ్యూనరేషన్ త్వరితగతింగా అందించాలని కోరుతూ ఇన్చార్జి డి ఏవో అంపయ్యకు వినతి పత్రాన్ని ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా బిఎల్వోలు మాట్లాడుతూ తాము ఎన్నికలకు ముందు ఎన్నికల విధులను సమగ్రంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఏల్వోలుగా పని చేయడం జరిగిందని, అయితే మాకు రావలసిన రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున రాలేదని వారు తెలిపారు. ఎన్నికలలో తాము రెండు రోజులు పాటు రాత్రింబగళ్లు పనిచేశామని, వచ్చే డబ్బు కూడా రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంపయ్యా మాట్లాడుతూ తమ సమస్యను ఆర్డిఓ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.